
డిజిటల్ వార్త సంస్థ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థ పై నమోదైన ప్రధానమైన కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ వివాదానికి సంబంధించిన తాజా కోర్టు తీర్పు మరియు కేసుల వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి…….
హిందు 9 న్యూస్ వెబ్ డెస్క్ ఢిల్లీ ; ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన కేసులు (eow )& Ed కేసులు ఆర్థిక నేరాల విభాగం eow fir 2018, 19, ఆర్థిక సంవత్సరంలో అమెరికా సంస్థ నుండి 9.59 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎఫ్ డి ఐ నిబంధనలకు విరుద్ధంగా షేర్ల విలువలను విపరీతంగా పెంచి సేకరించారని ఢిల్లీ పోలీసు eow కేసు నమోదు చేసింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ Ed ecir పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ జరిగిందంటూ Ed కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.ఈ కేసును కొట్టేస్తూ జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ తీర్పునిచ్చారు.
విదేశీ పెట్టుబడులు వచ్చిన సమయంలో డిజిటల్ మీడియాపై ఎటువంటి ఎస్బిఐ పరిమితులు లేవని షేర్ల విలువ నిర్ణయం ఒక ఆర్థికపరమైన నిర్ణయమే తప్ప అందులో ఎలాంటి క్రిమినల్ నేరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుల ప్రక్రియను చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేయడమే అని కోర్టు అభిప్రాయపడింది.
The Hindu, సౌజన్యంతో..
